వరద బాధితుల సహాయార్థం రిటైర్డు రెవెన్యూ ఉద్యోగుల దాతృత్వం

68చూసినవారు
వరద బాధితుల సహాయార్థం రిటైర్డు రెవెన్యూ ఉద్యోగుల దాతృత్వం
విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం నెల్లూరుజిల్లా రిటైర్డు రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌ సభ్యులు తమ దాతృత్వం చాటుకున్నారు. గురువారం నెల్లూరు కలెక్టర్ వారి చాంబర్లో సీఎం సహాయనిధికి రూ. 1, 10, 116 చెక్కును జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌కు అందించారు. అలాగే అసోసియేషన్‌ ట్రెజరర్‌ నంబూరు మస్తానయ్య మరో రూ. 15వేల చెక్కును సిఎంఆర్‌ఎఫ్‌కు జమ చేయాలని కలెక్టర్‌కు అందించారు.

సంబంధిత పోస్ట్