తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనందరి భవిష్యత్తు బాగుంటుందని సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీ అన్నారు. ఆదివారం దొరవారిసత్రం మండలం లోని సింగ నాలతూరు, మేలనాలత్తూరు గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, నాయకులతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.