సామంత మల్లంలో తెదేపా అభ్యర్థిని విజయశ్రీ ఎన్నికల ప్రచారం

73చూసినవారు
సామంత మల్లంలో తెదేపా అభ్యర్థిని విజయశ్రీ ఎన్నికల ప్రచారం
సూళ్లూరుపేట రూరల్ మండలం సామంతమల్లం పంచాయతీలో శనివారం తెదేపా అభ్యర్థిని నెలవల విజయశ్రీ ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, రూరల్ మండలం తెదేపా అధ్యక్షుడు కొక్కు శంకరయ్యతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్