పెన్షన్ పంపిణీ పై స్పందించిన ఎంపీడీవో
ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మే ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు డిపిటి పద్ధతి ద్వారా పెన్షన్ దారులకు పెన్షన్ అందజేస్తున్నట్లు ఉదయగిరి మండలం ఎంపీడీవో డి. ఈశ్వరమ్మ మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఉదయగిరి మండలం పరిధిలోని 12 సచివాలయాల ద్వారా రూ. 40. 76. 500 పంపిణీ చేస్తున్నామన్నారు. దీనిపై పెన్షన్ లబ్ధిదారులు ఎవరు చింతించవద్దన్నారు.