వ్యాపారులతో నేదురుమల్లి ఆత్మీయ సమావేశం
వెంకటగిరి పట్టణంలోని 18వ వార్డు బజారువీధిలో సోమవారం వైఎస్సార్ సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్ది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగనన్న అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమాన్ని అందించారని గుర్తు చేశారు. అలాగే వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా ఉండాలని కోరారు.