ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి

63చూసినవారు
ఈనెల 13వ తేదీన ప్రజలందరూ తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని విజయవాడ రూరల్ డిసిపి కంచి శ్రీనివాసరావు అన్నారు. గురువారం రాత్రి తిరువూరు పట్టణంలోని పలు ప్రధాన రహదారుల వెంబడి పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛ వాతావరణం లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో పోలీసులు ప్లగ్ మార్చ్ చేశారు.

సంబంధిత పోస్ట్