ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చిన ఐఏఎస్ అధికారులు

63చూసినవారు
ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చిన ఐఏఎస్ అధికారులు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏపీ ఐఏఎస్ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు. బుధవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆర్. పి. సిసోడియా, బుడితి రాజశేఖర్, సాయి ప్రసాద్, కృష్ణబాబు, విజయానంద్, వీరపాండ్యన్, కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్