కొమరాడలో ముమ్మరంగా వాహన తనిఖీలు

67చూసినవారు
కొమరాడలో ముమ్మరంగా వాహన తనిఖీలు
ఎల్లుండి ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో పోలీసులు వాహన తనీఖీలను ముమ్మరం చేశారు. కొమరాడ ఎస్సై నీలకంఠం ఆధ్వర్యంలో కూనేరు నుంచి పార్వతీపురం అంతర్రాష్ట్ర రహదారిపై వచ్చి, పోయే వాహనాలను ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్