రామోజీ మృతి పట్ల సంతాపం తెలిపిన జర్నలిస్టులు

59చూసినవారు
రామోజీ మృతి పట్ల సంతాపం తెలిపిన జర్నలిస్టులు
భారతదేశ మీడియారంగంలో అగ్రగణ్యులు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల కురుపాంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శనివారం సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం దేశంలోని మీడియా రంగానికి, ప్రత్యేకంగా ఈనాడు గ్రూప్ సంస్థలకు తీరనిలోటని అన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్