వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

66చూసినవారు
వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో పోలీసులు వాహన తనీఖీలను ముమ్మరం చేశారు. కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఎస్సై షణ్ముఖరావు ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వైపు వచ్చి, పోయే వాహనాలను తనిఖీలు నిర్వహించి వాహన పత్రాలను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్