మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందజేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి ఓటర్లను కోరారు. గురువారం పాలకొండ నగర పంచాయతీలోని పలు వార్డుల్లో కళావతి ముమ్మురంగా ప్రచారం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని చేపట్టారు.