గుడి గంటలను అపహరించిన దొంగలు

66చూసినవారు
గుడి గంటలను కూడా దొంగలు విడిచిపెట్టడం లేదు. కంభంలోని సోమనాధేశ్వర స్వామి, పార్వతి దేవాలయాలలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు గుడి గంటలకు దొంగిలించారు. గురువారం ఉదయం పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు గుడిలోని గంటలు కనిపించలేదు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ఆలయంలో దొంగలు పడ్డారని అర్చకులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్