భారీ మెజారిటీతో గెలిపించుకున్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డిని బుధవారం కలిసేందుకు కనిగిరి నియోజకవర్గం ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కనిగిరి లోని టీడీపీ పార్టీ కార్యాలయం చేరుకొని ఉగ్ర నరసింహ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయన అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కష్టపడి పనిచేసిన వారిని అభినందించారు. అనంతరం ప్రజలతో ఫోటోలు దిగారు.