కనిగిరి పట్టణంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు హిందీ పరీక్ష సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎస్ఐ టి శ్రీరామ్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మొత్తం ఎనిమిది పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాయగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డ్రోన్ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.