భైరవకోన క్షేత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

74చూసినవారు
భైరవకోన క్షేత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర
సిఎస్ పురం మండలంలో శైవ క్షేత్రంగా పేరు గాంచిన భైరవకోన పుణ్యక్షేత్రాన్ని శనివారం కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసి బైరవకోన జలపాతం ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో వరద నీరు క్షేత్రాన్ని ముంచెత్తింది. భక్తుల విషయంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్