రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర

64చూసినవారు
కనిగిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్త దాన శిబిరాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. మానవత్వం నింపుకున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జనసైనికులను అభినందించారు.

సంబంధిత పోస్ట్