897 పొగాకు బేళ్లు కొనుగోలు

60చూసినవారు
897 పొగాకు బేళ్లు కొనుగోలు
టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో బుధవారం జరిగిన వేలంలో 897 పొగాకు బేళ్లు కొనుగోలు చేశారు. ఆలకూరపాడు, రావివారిపాలెం, అనంతవరం, పాలేటిపాడు, జయవరం గ్రామాలకు చెందిన రైతులు 977 బేళ్లను వేలానికి తీసుకురాగా 897 బేళ్లను కొనుగోలు చేసి 80 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 236, కనిష్ట ధర రూ. 220, సరాసరి ధర రూ. 229. 20 పలికింది. వేలంలో 32 మంది వ్యాపారులు పాల్గొన్నారని నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్