సింగరాయకొండ: తిరుమల పట్టాభి నగర్ లో జలప్రళయం

75చూసినవారు
సింగరాయకొండ: తిరుమల పట్టాభి నగర్ లో జలప్రళయం
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తిరుమల పట్టాభి నగర్ లో జలప్రళయం నెలకొంది. శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పట్టాభి నగర్ వీధులన్నీ వాగులను తలపించాయి. శనివారం ఒక్కరోజే 86. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోనే అత్యధికంగా సింగరాయకొండలో వర్షపాతం నమోదయినట్లుగా అధికారులు చెప్పారు. మండలంలో వర్షాలు దంచి కొట్టడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

సంబంధిత పోస్ట్