మినీ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ తెలిపారు. ఒంగోలులోని ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులతో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆటో యూనియన్ సభ్యులను ఆయన కోరారు. టిడిపి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని దామచర్ల తెలిపారు.