చీమకుర్తిలో రౌడీషీటర్లకు సీఐ దుర్గాప్రసాద్ కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధవారం చీమకుర్తి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట వారిని హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల దృష్ట్యా ఎటువంటి గొడవలు, కేసులలో ఇన్వాల్స్ కావద్దని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుని బైండోవర్ చేస్తామని హెచ్చరించారు.