మరో రెండు రోజుల్లో తాను టీడీపీలో చేరనున్నట్లు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఐతవరంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని, ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతానని క్లారిటీ ఇచ్చారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని, టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటామని అన్నారు.