జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీకి సోమవారం ఊహించని షాక్ తగిలింది. సింగ్భూమ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ, మాజీ సీఎం మధుకోడా భార్య బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రాంచీలోని పార్టీ కార్యాలయంలో ఆమెకు బాబూలాల్ పార్టీ కండువా కప్పి, సాదర స్వాగతం పలికారు. ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తులపై అసంతృప్తితో ఆమె బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.