ఏపీలో పింఛన్ల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు

1068చూసినవారు
ఏపీలో పింఛన్ల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు
ఏప్రియల్ 30వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని, గరిష్ఠంగా 3వ తేదీలోపు పంపిణీ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పింఛను పంపిణీకి దాదాపు 10వేల అదనపు కేంద్రాలను గుర్తించామని, వృద్ధులకు ఇబ్బంది లేకుండా నీడ కోసం టెంట్లు, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 7 నుంచే పంపిణీ మొదలుపెట్టి రాత్రి 7 గంటల వరకు కొనసాగిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్