విద్యుత్ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

69చూసినవారు
విద్యుత్ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ధర్మవరం మండలం రేగాటిపల్లిలో శుక్రవారం కారు షెడ్డు నిర్మాణం చేస్తున్న సమయంలో నారాయణస్వామి అనే భవన నిర్మాణ కూలీకి విద్యుత్ వైర్లు తగిలి గాయాలు అయ్యాయి. బాధితుడు నారాయణస్వామిని స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ నారాయణస్వామి ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన దినసరి కూలీ అని తోటి కార్మికులు తెలిపారు. ఈ ప్రమాదంపై ధర్మవరం గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్