చికిత్స పొందుతూ మహిళ మృతి

50చూసినవారు
చికిత్స పొందుతూ మహిళ మృతి
చెన్నేకొత్తపల్లి మండలంలోని నాగసముద్రం రైల్వే గేటు వద్ద ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళను గుర్తించిన వారు హిందూపురం రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్