రైతులందరిని ఆశ్చర్య పరిచేలా గుంటుక తోలిన యువరైతు

50చూసినవారు
రైతులందరిని ఆశ్చర్య పరిచేలా గుంటుక తోలిన యువరైతు
వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామంలో యువరైతు మహేష్ తన ఎద్దులతో మంగళవారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 ఎకరాలు గుంటక తోలాడు. నాలుగు రోజులు పట్టాల్సిన పొలం వేగంగా తక్కువ సమయంలో దున్ని రైతులందరినీ ఆశ్చర్యపరిచాడు. గ్రామస్థులంతా ఆసక్తికరంగా తిలకించారు. రైతు మహేష్ సహసాన్ని అభినందిస్తూ ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి ఊరంతా ఊరేగింపు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్