ప్రభుత్వంలోకి రాగానే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంపై
వైసీపీ స్పందించింది. 'వాలంటీర్ వ్యవస్థ శక్తిని గుర్తించినందుకు చంద్రబాబు,
మోదీ, పవన్ లకు థ్యాంక్స్. ఇది జగనన్న పాలనా విజయానికి నిదర్శనం.. అందుకే విపక్షాలు కూడా ఆదరించి, పాటించాలనుకునేలా చేసింది. మీరేం చింతించకండి.. జూన్ 4
జగన్ సీఎంగా ప్రమాణం చేయగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం' అని ట్వీట్ చేసింది.