రేపు ఈ జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు

66చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు
AP: రాష్ట్రంలోకి జూన్ 2న ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు రాష్ట్రం అంత‌టా విస్త‌రించాయ‌ని APSDMA వెల్ల‌డించింది. రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో రేపు మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు.. చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.

సంబంధిత పోస్ట్