ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, ఈ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.