పెద్ద శేషునిపై పరమపథ నాథుడు విహారం

61చూసినవారు
తిరుపతి రూరల్ మండలం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొద‌టిరోజు శుక్రవారం రాత్రి పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఏడుతలల పెద్ద శేష వాహనంపై ప‌ర‌మ‌ ప‌ద‌నాథుని అలంకారంలో మలయప్ప స్వామి అనుగ్ర‌హించారు. శేషుడిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆ పై పరమపదం సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం.

ట్యాగ్స్ :