జాతరకు పటిష్ఠ బందోబస్తు: సీఐ

62చూసినవారు
జాతరకు పటిష్ఠ బందోబస్తు: సీఐ
నగరి పట్టణంలో మంగళ, బుధవారం జరగనున్న గంగమ్మ జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని మంగళవారం సీఐ మహేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి గ్రామ దేవతలు ఓరుగుంటాలమ్మ, దేశమ్మను ఊరేగించే క్రమంలో బందోబస్తు కల్పించామన్నారు. మూడు రోజుల పాటు ప్రకాశం రోడ్డులో వాహనాల రాకపోకలు నిషేధించామన్నారు. బస్సులు, కార్లు, ఇతర వాహనాలు బైపాస్ రోడ్డులో వెళ్లి నాగలాపురం రోడ్డు మీదుగా బస్టాండ్ కు చేరుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్