ఆటో క్యాబ్ కార్మికులు సమస్యలపై ఉద్యమించాలి

57చూసినవారు
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆటో క్యాబ్ కార్మికులు సమస్యలపై ఉద్యమించాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు వి. లక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సంత తోట జంక్షన్ లో సిఐటియు అనుబంధంగా ఆటో క్యాబ్ కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకుని బోర్డును పెట్టారు. జాతీయపతాకాన్ని లక్ష్మి ఆవిష్కరించారు. ప్రధానకార్యదర్శి కె. సురేష్, నేతలు సురేష్, ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్