వైద్య ఆరోగ్య సేవలపై కేంద్ర బృందం ఆరా

72చూసినవారు
వైద్య ఆరోగ్య సేవలపై కేంద్ర బృందం ఆరా
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య సేవలపై కేంద్ర బృందం ప్రతినిధులు వై. ఆర్. సింగ్, ఎన్. కె. వాద్వాలు ఆరా తీశారు. సోమవారం గజపతినగరం ఎం. పి. డి. వో కార్యాలయంలో వైద్యశాఖతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మిషన్ ఇంద్రధనస్సు, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాలపై చర్చించి సమాధానాలతో సంతృప్తి చెందారు. ఆర్డీవో సూర్య కళ, ఎంపీడీవో జయంతి ప్రసాద్, తహసిల్దార్ రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్