గరుగుబిల్లి మండల కేంద్రంలో మరియు పోలినాయుడువలస, రావుపల్లి తదితర గ్రామాలలో సుమారుగా 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఆదివారం రాత్రి కురిసింది. మూడు రోజులుగా ఉక్క పోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. ఉరుములు మెరుపులతో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.