269 మద్యం సీసాలు స్వాధీనం
పార్వతీపురం జిల్లా ఏఈఎస్ జీవన్ కిషోర్ ఆదేశాలు మేరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు బెల్ట్ షాపులపై గురువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 269 ఒరిస్సా మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీఐ జె. శ్రీనివాసరావు ఎస్ఐ షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు.