రోడ్డు ప్రమాదం..మహిళ మృతి

5168చూసినవారు
రోడ్డు ప్రమాదం..మహిళ మృతి
విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పూసపాటిరేగ మండలంలో
చోటుచేసుకుంది. ఎస్సై వివరాల మేరకు.. చోడమ్మ అగ్రహారానికి చెందిన జి.సత్యవతి(40) బుధవారం గ్రామ సమీపంలో ఉపాధి పనులకు వెళ్లారు. ఈక్రమంలో స్థానిక జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్