పశువులు అక్రమ రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు

52చూసినవారు
పశువులు అక్రమ రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఒడిస్సా రాష్ట్రం నుంచి ఆంద్రాకు అక్రమంగా తరలిస్తున్న పశువులను పాచిపెంట ఎస్సై వెంకట సురేషు పట్టుకొని కేసు నమోదు చేశారు. శుక్రవారం కోనవలస చెక్ పోస్టు వద్ద పాచిపెంట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మూడు బొలెరా వాహనాల్లో పశువులు, దున్నలు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలించడంతో మూడు వాహనాలతో పాటు పశువులను స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్