తోణాం గిరిజన సంతలో వైకాపా ప్రచారం
రాష్ట్రంలో వైసీపీ గెలుపు, పేద ప్రజలకు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సిఎం జగన్ బలపరిచిన వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పీడిక రాజన్న దొర, తనూజా రాణిలను గెలిపించాలని ఆ పార్టీ సాలూరు మండల నాయకులు విజ్ఞప్తి చేసారు. శనివారం తోణాం గిరిజన సంతలో వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారం కావించారు. ఈ కార్యక్రమం లో తోణాం సర్పంచ్, ఎంపిటిసిలు పాల్గున్నారు.