కొత్తవలస: విశాఖ రాయపూర్ ప్యాసింజర్ రైలు సమయాల్లో మార్పు

52చూసినవారు
కొత్తవలస: విశాఖ రాయపూర్ ప్యాసింజర్ రైలు సమయాల్లో మార్పు
విశాఖ నుండి కొత్తవలస మీదుగా రాయపూర్ వెళ్లే ప్యాసింజర్ రైలు సమయాల్లో మార్పు జరిగినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సందీప్ సోమవారం తెలిపారు. రైలు నెంబర్ 08528 ఇకనుండి విశాఖ నుండి ఉదయం 6: 30 గంటలకు బదులు తెల్లవారుజామున 4: 25 నిమిషాలకు విశాఖలో బయలుదేరి కొత్తవలస రైల్వే స్టేషన్ కు 5: 05 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్