మహిళా సాధికారత కావాలంటే టిడిపి అధికారం చేపట్టాలి

540చూసినవారు
మహిళా సాధికారత కావాలంటే టిడిపి అధికారం చేపట్టాలని ఎస్. కోట ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎస్ కోటలో సోమవారం మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన జయహో బిసి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా టిడిపి నిలిచిందని కొనియాడారు. బీసీల అభివృద్ధి, సంక్షేమమే టిడిపి లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్