చెత్త నుండి సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఈ వో పీ ఆర్ డి

59చూసినవారు
చెత్త నుండి సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఈ వో పీ ఆర్ డి
ఎస్ కోట మేజర్ పంచాయతీ పరిధిలో గల చెత్త నుండి సంపద కేంద్రాన్ని ఈ ఓ పి ఆర్ డి లక్ష్మి మంగళవారం స్థానిక సర్పంచ్ గనివాడ సంతోషి కుమారి తో కలసి పరిశీలించారు. గృహ వినియోగదారులు తడి పొడి చెత్తను వేరు చేసి క్లాప్ మిత్రలకు ఇవ్వడం వల్ల గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. ఈ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి మండలంలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

సంబంధిత పోస్ట్