ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నుంచి నేరుగా పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణ మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. దీనికోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, డిటిలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.