విశాఖకు చెందిన ఎర్రాజీ జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హతసాధించింది. పారిస్లో 23వ ఒలింపిక్ క్రీడలు ఈనెల 25 నుంచిఆగస్టు 7వరకు జరగనున్నాయి. భారతదేశం తరుఫున 100 మీటర్ల హార్డిల్స్లో ప్రపంచ ర్యాంకర్ జ్యోతి పాల్గొంటుంది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హార్డిల్స్లో దేశం తరపున మొదటిసారిగా జ్యోతి పోటీ పడుతుంది. ఇప్పటికే జ్యోతి అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించిందని ఆమె తల్లిదండ్రులు బుధవారం తెలిపారు