టీడీపీతోనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఎంపీటీసీ బాబురావు అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని అన్నవరం పంచాయతీ పరిధి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బిజెపి బలపరిచిన ఉమ్మడి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు అప్పారావు తదితరులున్నారు.