అరకు లోయ అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా సమర్ధి రఘునాధ్ శుక్రవారం నామినేషన్ వేశారు. అరకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఐటిడిఏ పిఓ అభిషేక్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి అరకులోయ లో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని రఘునాధ్ తెలిపారు. అయితే అరకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో వైసీపీ రెబల్ గా నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు.