ప్రతీ ఏడాది మొదటి విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేసే విద్యా కానుక కిట్ల నాణ్యత విషయంలో అధికారులు దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తుందని అన్నారు.