పూర్తిగా నీట మునిగిన పంట పొలాలు

56చూసినవారు
పూర్తిగా నీట మునిగిన పంట పొలాలు
ఎలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామ పరిధిలో వరి పొలాలు పూర్తిగా నీటమునిగాయి. సోమవారం ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని రైతులు నాగేశ్వరావుకు విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్