పసుపు వర్ణ అలంకరణలో స్వయంభూ శ్రీ విగ్నేశ్వర స్వామి దర్శనం

59చూసినవారు
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా2రోజు ఆదివారం చోడవరం స్వయంభూ శ్రీ విగ్నేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారు హరిద్ర వర్ణ పసుపు అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పసుపు వర్ణంలో గల స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు చేకూరుతాయన్న ప్రగాఢ విశ్వాసం. దీంతో అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్