కొయ్యూరు: కారును ఢీకొన్న బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

80చూసినవారు
కొయ్యూరు: కారును ఢీకొన్న బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం డౌనూరు సమీపంలో శనివారం మధ్యాహ్నం చింతపల్లి నుండి నర్సీపట్నం వస్తున్న రెండవ స్టాప్ ఆర్టీసీ బస్సు డౌనూరు మర్రిపాలెం గ్రామాల మధ్య ముందు వెళ్తున్న కారును తప్పించే క్రమంలో బలంగా ఢీ కొట్టి అదుపుతప్పి 15 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. చింతపల్లి నుండి నర్సీపట్నం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వేగంగా వెళ్తున్న కారుకు మర్రిపాలెం సమీపంలో ఎదురుగా కుక్క అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్