290 మంది వాలంటీర్లు రాజీనామా

8982చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీలో 290 మంది వాలంటీర్లు తమ రాజీనామాలను గురువారం మున్సిపల్ కమిషనర్ రవి బాబుకు అందజేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. రాజీనామాలు సమర్పించిన నేపద్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని మరొక్కసారి వివరిస్తామన్నారు. తమ ప్రచారం పట్ల తమ ఇళ్లల్లో అభ్యంతరం ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్